అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివ దేహానికి వైసీపీ నాయకులు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్న పార్థివ దేహానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి, కడప మేయర్ సురేశ్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు.