టిడిపి ప్రభుత్వం తొలిసారిగా జూలై 1వ తేదీన పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ రవీంద్ర నాథరెడ్డి ఆదివారం పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, డివిజన్, వార్డు అధ్యక్షులు, ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు
పంపిణీ చేయాలని సూచించారు.