తొండూరు మండలం మడూరు - దొండ్లవాగు మధ్య గురువారం దొంగలు రెచ్చిపోయారు. మడూరు గ్రామ సచివాలయంలో దీవెనమ్మ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. స్కూటర్ పై మడూరుకు వెళ్తున్న దీవెనమ్మను దొండ్లవాగుకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి బెదిరించి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గణ మద్దిలేటి తెలిపారు