గ్రామాలు అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇమామ్ నగర్ లో సిమెంటు రోడ్డుకు శుక్రవారం బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేంపల్లిలో రూ.70.50 లక్షల నిధులు మంజూరు అయినట్లు చెప్పారు. ఇమాం నగర్ లో 7 లక్షల యాభై వేల రూపాయలతో సిమెంటు రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు.