వేంపల్లె పరిధిలోని ట్రిపుల్ ఐటీలో 2025-26 ఏడాదికి సంబంధించి అడ్మిషన్లు పొందేందుకు ఆర్.యు.కె ఇచ్చిన చివరి తేదీ నాటికి విద్యార్థుల నుండి 50,541 దరఖాస్తులు వచ్చినట్లు రిజిస్ట్రార్, నూజివీడు క్యాంపస్ డైరెక్టర్, అడ్మిషన్ కన్వీనర్ అమరేంద్ర సండ్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు, దరఖాస్తుల గడువును మే 2 నుండి మే 10 వరకు పొడిగించడంతో 1, 340 దరఖాస్తులు అదనంగా వచ్చాయన్నారు.