తుఫాను కారణంగా తూర్పు కొండలలో అధిక వర్షపాతం కురవడంతో గుండాల కోన ఏరు ఉదృతంగా ప్రవహిస్తోంది. సోమవారం వర్షం పూర్తిగా ఆగకపోవడంతో ఏరు ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. గుండాల కోన నీరు జిల్లాలో అతి పెద్ద చెరువులలో ఒకటైన ఎల్లమరాజు చెరువులోనికి చేరుతుంది. ఇప్పటికే దాదాపు నిండుగా ఉన్న ఎల్లమరాజు చెరువుకు ఇదే విధంగా నీరు చేరితే మంగళవారం చెరువు అలుగు పారే అవకాశం ఉంది.