ప్రజల సమస్యలను అధికారులు ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచి పేరు ప్రభుత్వానికి వస్తుందని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి అన్నారు. సోమవారం చిట్వేలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలో 60 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిందని ఆయన అన్నారు.