చిట్వేలు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో మరమ్మతులు కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చిట్వేలు మండల విద్యుత్ శాఖ ఏఈ చలపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిట్వేలు, పత్తిగుంట వారి పల్లి, నేతివారి పల్లి 11 కె. వి సబ్ స్టేషన్ల పరిధి లోని గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.