రైల్వే కోడూరులో 30వ తేదీ నుండి గంగమ్మ జాతర

78చూసినవారు
రైల్వే కోడూరులో 30వ తేదీ నుండి గంగమ్మ జాతర
రైల్వే కోడూరులో 30వ తేదీ నుండి గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు గంగమ్మ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం చాటింపు తో ప్రారంభమైన గంగమ్మ జాతర గురువారం దున్నపోతును వెంట తీసుకుని గంగమ్మ ఘటం తో కమిటీ సభ్యులు ఇంటింటికి ఊరేగించారు. ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని గంగమ్మ జాతర కమిటీ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్