రైల్వే కోడూరు మండలం మైసూరా వారి పల్లెకు చెందిన జనసేన కార్యకర్త పగడాల చంద్రశేఖర్ భార్య వరలక్ష్మిని రైల్వే కోడూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఎంపిక చేశారు. కూటమి ప్రభుత్వం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన, టీడీపీ నుండి అనేక మంది మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పోటీ పడ్డారు.