బాధితులకు అండగా ఉంటామని ఎవరూ ఆధైర్యపడద్దని ముక్కా వరలక్ష్మి అన్నారు. కిడ్నీ వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న చిట్వేలు మండలం తిమ్మాయ పాళెం గ్రామానికి చెందిన చిరంజీవికి తన సొంత నిధులు రూ. 1, 50, 000 సహాయాన్ని సోమవారం రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అందజేశారు.