కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా రైల్వే కోడూరు కు చెందిన కంటి వైద్యులు సయ్యద్ అహ్మద్ ను నియమిస్తూ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రైల్వేకోడూరు నియోజకవర్గం సమన్వయకర్త గోశాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శాంతయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.