వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రతి ఇంటిలో పంపిణీ చేసి, వాటిని వివరిస్తూ చేసే "జగన్ కోసం సిద్ధం" నియోజకవర్గ స్థాయి శిక్షణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రైల్వే కోడూరు పట్టణం రాజ్ కన్వెన్షన్ నందు నిర్వహిస్తున్నట్లు శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే శిక్షణా కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.