చిట్వేలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా జూనియర్ కాలేజీ విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ విద్యార్థుల కొరకు ప్రభుత్వం నూతనంగా మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి-2 ఈశ్వరయ్య, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏబీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.