ఓబులవారిపల్లి మండల పరిధిలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగినది. సీపీఐ పార్టీ మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, డిహెచ్పిఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి మోడీ శివయ్య మాట్లాడుతూ మండలంలో ఎక్కడ పట్టిన భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉండగా రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులకు భయపడి లేక వాళ్లకాడ ముడుపులు తీసుకొని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.