ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామానికి చెందిన షేక్ తాజన్ కు చికిత్సకు రూ. 2, 50, 000 సీఎం సహాయ నిధి మంజూరు చేయించి చెక్కులను బాధితుల నివాసం వద్దకే వెళ్లి పంపిణీ చేశామని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన పేదలకు సత్వర సహాయం అందించడం కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు.