ఓబులవారిపల్లి మండలం తల్లెంవారిపల్లిలో బీజేపీ జెండాలు కట్టారని అక్కసుతో, భూవివాదాన్ని ఊహించి, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు శనివారం రాజగోపాల్ రెడ్డి పై వైసీపీ కార్యకర్తలు కట్టెలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడిన విషయం కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలుసుకొని తిరుపతి మారుతీ హాస్పిటల్లో పరామర్శించారు. బాధితుడికి, ఆయన కుమారుడు గోవర్ధన్ రెడ్డికి ధైర్యం చెప్పి వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటానని తెలిపారు.