రైల్వేకోడూరు: 17 నుండి 26 వరకు రాష్ట్ర స్థాయి విద్య,వైజ్ఞానిక శిక్షణ తరగతులు:ఎస్‌ఎఫ్‌ఐ

82చూసినవారు
రైల్వేకోడూరు: 17 నుండి 26 వరకు రాష్ట్ర స్థాయి విద్య,వైజ్ఞానిక శిక్షణ తరగతులు:ఎస్‌ఎఫ్‌ఐ
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర విద్య,వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మదనమోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో గల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుండి 26 వరకు మదనపల్లిలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్