అనంతరాజుపేట పంచాయతీ రామయ్య పాలెం, తూర్పుపల్లెలో పారం పాండు పనులు, రాఘవ రాజు పురంలో ఉపాధి కార్మికులు చేస్తున్న పనులను సిఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్ శనివారం పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల నుండి, కూలి డబ్బులు పడలేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో సక్రంగా కూలి డబ్బులు ఇవ్వడం లేదన్నారు.