రైల్వే కోడూరు మండలం లోని గుండాలేరు బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం చెన్నై నుంచి మహారాష్ట్ర లోని పుణే కి వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పక్కనున్న వంకలో బోల్తా పడింది. ప్రమాదం నుండి లారీ డ్రైవర్ తప్పించుకున్నారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.