గుంటూరు జిల్లా, పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి
జగన్ మోహన్ రాజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి శాలువా కప్పి పుష్పమాల వేసి ఘనంగా సత్కరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.