రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాగ్దాన ప్రకారం ప్రతి అర్హుడికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని జులై 1న నిర్వహిస్తున్నారని జనసేన పార్టీ నేత అతికారి కృష్ణ అన్నారు. ఆయన శనివారం సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో మాట్లాడుతూ వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ తో పాటు మూడు నెలల బోనస్ కలిపి 7000 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.