అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు,సిహెచ్ చంద్రశేఖర్ చిట్వేల్ రవికుమార్,పంది కాళ్ళ మణి మంగళవారం గ్రామాల్లో పర్యటించారు. చెర్లోపల్లి, చెంచురాజుగారిపల్లి, హస్తవరం తాళ్లపాక, రాజంపేట మార్కెట్ యార్డ్ గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా అప్పుల్లో మునిగిపోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.