ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అంతకుముందే ఆలయంలో దర్శనం ఏర్పాట్లు చేశారు.