చిట్వేలి మండలం కె. కందులవారి పల్లి పంచాయతీ గాంధీనగర్ కు చెందిన డేరంగుల ఈశ్వరయ్య, వెంకటమ్మ కుమారుడు అంకయ్య వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణమునకు శనివారం 22, 116 రూపాయలు విరాళం అందించారు. వారికి మరియు వారి కుటుంబసభ్యులు అందరికి వీరబ్రహ్మేంద్రస్వామి దీవెనలు ఉండాలని ఆలయ ధర్మకర్త కట్టా రామ మోహన్ కోరారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించి విరాళాలు ఇవ్వవలసిందిగా ఆయన కోరారు.