గత వైకాపా పాలనలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా త్రాగునీటి శుద్ధి కేంద్రానికి నీటి సరఫరా కనెక్షన్ ఏర్పాటుకు అనుమతి ఎలా ఇచ్చారని జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వాహక అధికారి సుధాకర్ రెడ్డి పై ఒంటిమిట్ట మండలం కొండమాచపల్లి తెదేపా నాయకులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచి శివ నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్వో కేంద్రానికి మూడు నీటి కనెక్షన్లు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.