కడపలో ఫిబ్రవరి 8, 9 తేదీలలో జరిగే ఉమ్మడి కడప జిల్లా రచయితల మహాసభకు నందలూరు నాగిరెడ్డి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, తెలుగు పండితులు, కవి గంగనపల్లి వెంకటరమణకు గురువారం ఆహ్వానం అందింది. తెలుగు పండితులుగా, తెలుగు భాషా సంరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శిగా, కవిగా గంగనపల్లి వెంకటరమణ గుర్తింపు పొందారు.