ఒంటిమిట్టలో జరగబోయే సీతారాముల కల్యాణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కడప ఎయిర్పోర్ట్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.