ప్రతి ఒక్కరు సమిష్టిగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని ఒంటిమిట్ట ఎంఈఓ వెంకటసుబ్బయ్య అన్నారు. గురువారం కొత్త మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాజమాన్య కమిటీ సభ్యులకు ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కొరకు యాజమాన్య కమిటీ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వచ్చి సహకరించాలని కోరారు.