ఒంటిమిట్ట మండలం వెంకటాయపల్లి గ్రామం ఓబులేసు కోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరణాల మహోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. ఉదయం స్వామివారికి అభిషేకం, హోమం, పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు.