ఆప్కాస్ విధానాన్ని కొనసాగించి మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. హామీల సాధన కోసం మునిసిపల్ కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో గురువారం కార్మికులు మోకాళ్ళపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. రవికుమార్ మాట్లాడుతూ గతంలో డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని అన్నారు.