పెనగలూరు మండలం ఓబిలిలో జూన్ 23న జరిగిన వినాయకుని విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 13మందిని అరెస్ట్ చేసి ట్రాక్టర్, కారు, 4బైకులు స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల కోసం ఈ విగ్రహాన్ని దొంగలించారని రాజంపేట రూరల్ ఇన్స్పెక్టర్ బీవీ రమణ తెలిపారు. శనివారం మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టారు.