రాజంపేట మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అయ్యప్ప స్వాముల సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. అయ్యప్ప స్వామి మాల ధరించిన మున్సిపాలిటీ ఉద్యోగి పట్ల మున్సిపల్ కమిషనర్ బిల్లా నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహంతో నిరసన వ్యక్తం చేశారు.