రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని నేకనాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎద్దుల వెంకట నరసయ్య శనివారం తన స్వగృహంలో గుండె నొప్పితో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ నరసయ్య మృతదేహానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసయ్య లాంటి వ్యక్తి హఠాత్తుగా మృతి చెందడం బాధాకరమైన విషయం అని అన్నారు.