పిఠాపురం (చిత్రాడ)లో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ వేడుకల నిర్వహణలో భాగంగా రాజంపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ సమన్వయకర్తగా 5 మందిలో ఒకరిగా పసుపులేటి కళ్యాణ్ ని నియమించినట్లు ఆయన తెలిపారు. కళ్యాణ్ మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్స వేడుకలకు సమన్వయకర్తగా నియమించిన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జిల్లా సమన్వయకర్త అతికారి కృష్ణాకు, జనసేన పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.