ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు చిన్న వెంకటరెడ్డి తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం పోలీసులతో తనిఖీలు నిర్వహించడాన్ని నిరసిస్తూ వెంకట రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏఎస్పీ మనోజ్ రాంనాథ్ హెగ్డే కి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.