మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ తల్లికి వందనంపై లేదని వైసిపి జిల్లా యువజన విభాగం నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం నందలూరు లో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ భేటీ జరగడంతో సంక్రాంతికి తల్లికి వందనం ప్రకటిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారని, ఆ పథకం గురించి క్యాబినెట్ భేటీలో చర్చలు జరపకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.