రామసముద్రం మండలం లోని దేవాలయం భూముల లీజులను రైతులు సకాలంలో చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు. గురువారం కాపుపల్లి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ స్వామి, జనార్దన్ స్వామి వాలేశ్వర స్వామి మరి కొంతమంది రైతులు ఆలయ భూముల లీజు చెల్లించకపోతే తిరిగి ఆ భూములను వేలం వేస్తామని ఆయన అన్నారు.