రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం కమ్మవారి పాలెం వద్ద రహదారి దెబ్బతిని కాలువను తలపిస్తోంది. ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నది నుండి పెద్ద వాహనాలు ఇసుక రవాణా చేయడంతో రోడ్డు పాడైపోయి గుంతల మయం అయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సిసి రోడ్డు వేయాలని వారు కోరారు.