అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్లమెంటు ఇంచార్జి యల్లటూరు శ్రీనివాస రాజు ను భువనగిరి పల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయానికి కృషి చేసిన నాయకులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసయ్య, సుబ్బయ్య, వెంకటరమణ, శంకర, నరసింహ పాల్గొన్నారు.