ప్రతి రోజూ యోగా అలవాటు చేసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చనని ఎంపీడీఓ సుధాకర రెడ్డి తెలిపారు. జూన్ 21వ తేది నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సోమవారం సుండుపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యోగాంధ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ ట్రైనర్స్, సుండుపల్లె ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు రాధా రాణి యోగాసనాలపై శిక్షణ నిచ్చారు.