సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలోని దిగువ జంగం పల్లి కు చెందిన మద్దిరాల రవి శంకర్ వేసిన వేరుశెనగ పంటలో శనివారం చుట్టూ సరిహద్దు పంటలు గా జొన్న, సజ్జ, అంతర పంటలు గా అలసంద, అనప, పెసర, కంది, ఎర్ర పంటలు గా ఆముదం వేయించడం జరిగింది. ఈ సందర్బంగా ఎన్ యం ఎన్ యఫ్ ఇంచార్జి రామ్మోహన్ మాట్లాడుతూ. ప్రతి రైతు పలు పంటలు వేయడం వలన అధిక ప్రయోజనం పొందవచ్చునని వివరించారు.