సుండుపల్లి మండల సమీపంలోని బండ కాడ ఈడిగపల్లి సాతుపల్లి మధ్య వెలసి ఉన్న జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో రెండో రోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. గురువారం ఉదయం స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహించి అనంతరం మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం అందజేశారు. సాయంత్రం 6 గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి రాత్రికి బద్వేలు కళాబృందంచే బ్రహ్మంగారి జీవిత చరిత్ర నాటకం కథా కాలక్షేపం ప్రదర్శించారు.