అతి పురాతనమైన దేవాలయాల్లో ఒకటైన వీరబల్లి మండల హరిహరాదుల దేవస్థానంలో ఈనెల 12న సోమవారం ఘనంగా జాతర నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ తిరుణాల మహోత్సవాలలో భాగంగా ఈ నెల 11న ఆదివారం శివపార్వతుల కళ్యాణం మొదలగు ప్రదర్శనలతో ఘనంగా జాతర నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు తెలియజేశారు.