వీరబల్లి మండలంలోని గర్భిణీ స్త్రీలకు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక చికిత్సలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డాక్టర్ మనీషా ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్సలతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన మందులు పంపిణీ చేశారు. అనంతరం మండల ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు భోజనం వసతులు కల్పించారు.