జూన్ 15 నుంచి 30 వరకు అన్నమయ్య జిల్లాలోని 4 మండలాలకు చెందిన 17 గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించనున్నారు. దార్తి ఆబాల జన్ జాతియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద ఆధార్, రేషన్ కార్డులు లేని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తారు. లక్కిరెడ్డిపల్లి, పెనగలూరు, రైల్వే కోడూరు, కురబలకోట అధికారులకు కలెక్టర్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.