అన్నమయ్య: వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. పవన్‌ కీలక ఆదేశాలు

61చూసినవారు
అన్నమయ్య: వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. పవన్‌ కీలక ఆదేశాలు
వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతిచెందింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చోటుచేసుకుంది. ఆ చిరుత కడుపులో రెండు పిల్లలు కూడా చనిపోవడంపై విమర్శలు వచ్చాయి. చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. పీసీసీఎఫ్‌ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు. ఉచ్చులు వేసే వేటగాళ్లు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్