అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రాయచోటి, మదనపల్లి, రాజంపేట సబ్ డివిజన్ లలో తనిఖీలు పోలీసు అధికారులు ముమ్మరం చేశారు. ఆంధ్ర రాష్ట్ర డీజీపి హరీష్ కుమార్ గుప్తా సూచనలతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్టాండ్ లు ఇలా అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తనిఖీలు నిర్వహించారు.