ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా మదనపల్లిలో పరీక్ష కేంద్రాలను మార్పులు చేర్పులు చేసి ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ ఆరోపించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ నందు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులపై కలెక్టర్ విచారణ జరపాలని కోరారు.