రాష్ట్ర ప్రభుత్వం పశుపోషణపై 50 శాతం రాయితీతో రైతులకు మొదటిసారిగా 20 శాతం ప్రొటీన్తో కలిగిన దాణా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్పిళ్లై పేర్కొన్నారు. శుక్రవారం చిన్నమండెం మండల కేంద్రంలోని స్థానిక పశువైద్య కార్యాలయం వద్ద రైతులకు ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి రైతులను ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో 50 శాతం రాయితీతో అందిస్తున్నామన్నారు.